సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ డివిజన్లోని గ్రామ పంచాయతీ కార్యదర్శులు స్థానిక ఎస్టీఓ కార్యాలయం ముందు ఆందోళన చేపట్టారు. డివిజన్ పరిధిలోని సర్పంచ్లతో స్థానిక ఎస్టీఓ కుమ్మక్కై తమకు తెలియకుండా పంచాయతీ నిధులను కాజేశారని ఆరోపించారు. గ్రామపంచాయతీలో జరిగే అభివృద్ధి పనులపై తమకు ఎలాంటి సమాచారం ఇవ్వటమే కాక... నిధుల దుర్వినియోగంలో వారికి సహకరిస్తున్నారని పేర్కొన్నారు. గ్రామపంచాయతీలో కీలకంగా వ్యవహరించాల్సిన తమను ఎస్టీఓ కించపరుస్తున్నారని... కార్యాలయానికి రాకుండా బెదిరిస్తున్నారని వెల్లడించారు. జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకెళ్తామని స్పష్టం చేశారు.
ఇంకెన్నాళ్లు పంచాయతీలో అవినీతి - పంచాయతీలో అవినీతి
సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ డివిజన్ పరిధిలోని సర్పంచ్లతో ఎస్టీఓ కుమ్మక్కై గ్రామపంచాయతీలో నిధుల దుర్వినియోగానికి పాల్పడుతున్నరని కార్యదర్శులు ఆందోళన చేపట్టారు.
![ఇంకెన్నాళ్లు పంచాయతీలో అవినీతి](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-4270824-883-4270824-1567001270831.jpg)
ఇంకెన్నాళ్లు పంచాయతీలో అవినీతి