సంగారెడ్డి జిల్లా సదాశివపేటలోని తహసీల్దార్ కార్యాలయం వెనుక అనుమానాస్పద స్థితిలో ఓ వృద్ధుడి శవం లభించింది. మృతుడు సదాశివపేట పట్టణానికి చెందిన శ్రీనివాస్గా పోలీసులు గుర్తించారు.
సదాశివపేటలో అనుమానాస్పద స్థితిలో వృద్ధుడి మృతదేహం - అనుమానాస్పద స్థితిలో వృద్ధుడి మృతదేహం
సదాశివపేటలోని తహసీల్దార్ కార్యాలయం వెనుక ఓ వృద్ధుడు అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. దేహంపై గాయాలు, ఘటన స్థలంలో చాకు ఉండటంతో పోలీసులు దీనిని హత్యగా అనుమానిస్తున్నారు.
సదాశివపేటలో అనుమానాస్పద స్థితిలో వృద్ధుడి మృతదేహం
మృత దేహంపై రక్తపు మరకలు, గాయాలు ఉన్నాయని... ఘటనా స్థలంలో చాకు ఉండటంతో పలు అనుమానాలకు దారి తీస్తోంది. శ్రీనివాస్ గురువారం నుంచి కనిపించని నేపథ్యంలో కుటుంబ సభ్యులు శుక్రవారం సదాశివపేట పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
ఇవీ చూడండి:శంభో.. శివ.. శంభో..
Last Updated : Feb 22, 2020, 3:07 PM IST