తెలంగాణ

telangana

కార్మిక ఎన్నికల్లో నాయిని విజయం

సంగారెడ్డి జిల్లా పటాన్​చెరులోని ఏషియన్​ పెయింట్స్​ పరిశ్రమలో నిర్వహించిన కార్మిక సంఘం గుర్తింపు ఎన్నికల్లో మాజీ హోంమంత్రి నాయిని నరసింహారెడ్డి గెలుపొందారు. సమీప ప్రత్యర్థి సంజీవరెడ్డిపై 136 ఓట్ల తేడాతో విజయం సాధించారు.

By

Published : Oct 15, 2019, 11:37 AM IST

Published : Oct 15, 2019, 11:37 AM IST

నాయిని విజయం

కార్మిక ఎన్నికల్లో నాయిని విజయం

కార్మిక సంఘం గుర్తింపు ఎన్నికల్లో హెచ్ఎంఎస్ సత్తా చాటింది. సంగారెడ్డి జిల్లా పటాన్​చెరులోని ఏషియన్​ పెయింట్స్​ పరిశ్రమలో కార్మిక సంఘం గుర్తింపు ఎన్నికలు నిర్వహించారు. ఈ ఎన్నికల్లో మాజీ హోంమంత్రి, హెచ్ఎంఎస్ జాతీయ ఉపాధ్యక్షుడు నాయిని నరసింహారెడ్డి గెలుపొందారు. ఐఎన్టీయూసీ జాతీయ అధ్యక్షుడు సంజీవరెడ్డిపై 136 ఓట్ల తేడాతో విజయం సాధించారు. పరిశ్రమ యాజమాన్యంతో మాట్లాడి కార్మిక సమస్యలు పరిష్కరించేలా కృషి చేస్తానని నాయిని తెలిపారు.

ABOUT THE AUTHOR

...view details