తెలంగాణ

telangana

ETV Bharat / state

సంగారెడ్డిలో మున్సిపల్​ అధికారుల బడ్జెట్​ సమావేశం

సంగారెడ్డిలో మున్సిపల్​ అధికారులు బడ్జెట్​ సమావేశం నిర్వహించారు. అధికారులు తెలిపిన బడ్జెట్​ లెక్కలు పేపర్​పై మాత్రమే ఉన్నాయని.. క్షేత్రస్థాయిలో నిధులు లేక పనులు ఎక్కడికక్కడే నిలిచిపోయాయని వార్డు కౌన్సిలర్లు ఆరోపించారు.

By

Published : Mar 18, 2020, 6:35 PM IST

సంగారెడ్డిలో మున్సిపల్​ అధికారుల బడ్జెట్​ సమావేశం
సంగారెడ్డిలో మున్సిపల్​ అధికారుల బడ్జెట్​ సమావేశం

సంగారెడ్డి పట్టణంలోని మున్సిపల్ కార్యాలయంలో బడ్జెట్ సమావేశాలు నిర్వహించారు. ఈ సమావేశంలో అధికారులు, కౌన్సిలర్లు పాల్గొన్నారు. వార్డుల్లో నెలకొని ఉన్న సమస్యలపై కౌన్సిలర్లు అధికారులను నిలదీశారు.

అధికారులు తెలిపిన బడ్జెట్ సమాచారం కాగితంపై మాత్రమే ఉందని.. వార్డుల్లో పనులు ఎక్కడికక్కడే నిలిచిపోయాయని వార్డు కౌన్సిలర్లు ఆరోపించారు. వార్డుల్లో ఇప్పటివరకు జరిగిన పనులపై ఉన్నతాధికారులు సర్వే నిర్వహించాలని వారు డిమాండ్ చేశారు.

సంగారెడ్డిలో మున్సిపల్​ అధికారుల బడ్జెట్​ సమావేశం

ఇదీ చూడండి :రేవంత్​ జైలుకెళ్లింది అందుకోసం కాదు: రాజగోపాల్​ రెడ్డి

ABOUT THE AUTHOR

...view details