తెలంగాణ

telangana

ETV Bharat / state

నిరుపేద పాస్టర్లకు నిత్యావసర సరుకుల పంపిణీ - ఎమ్మెల్సీలు రాజేశ్వర్ రావు, మహమ్మద్ ఫరీదుద్దీన్

సంగారెడ్డి జిల్లా జహీరాబాద్​లో ఎమ్మెల్సీలు రాజేశ్వర్ రావు, మహమ్మద్ ఫరీదుద్దీన్, ఎమ్మెల్యే మాణిక్​ రావులు నిరుపేద పాస్టర్లకు నిత్యావసర సరుకులను అందజేశారు.

mlc rajeshwar rao distributed daily commodities
నిరుపేద పాస్టర్లకు నిత్యావసర సరుకుల పంపిణీ

By

Published : Jun 5, 2020, 4:01 PM IST

సంగారెడ్డి జిల్లా జహీరాబాద్​లో క్రైస్తవ పాస్టర్లకు ఎమ్మెల్సీ రాజేశ్వర్ రావు ఆధ్వర్యంలో నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. పట్టణంలోని మెథడిస్ట్ రూరల్ చర్చిలో డివిజన్​లోని పాస్టర్లకు నెలకు సరిపడా బియ్యం, పప్పు, నూనెలను అందజేశారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే మాణిక్ రావు, ఎమ్మెల్సీ మహమ్మద్ ఫరీదుద్దీన్ పాల్గొన్నారు.

కరోనా కారణంగా మూడు నెలలుగా చర్చిలు, మసీదులు, ఆలయాలు మూతపడి అర్చకులు, పాస్టర్లు, మత గురువులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. వారి ఆకలి తీర్చేందుకే ఈ కార్యక్రమం చేపట్టినట్లు వివరించారు.

ఇవీ చూడండి:మీ ఇంట్లోనే కరోనా చికిత్స.. వైరస్​ నుంచి బయటపడే మార్గం

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details