తెలంగాణ

telangana

ETV Bharat / state

నాటిన ప్రతిమొక్కనూ బతికించుకోవాలి: ఎమ్మెల్యే మాణిక్​రావు - 6th phase haritha haaram

సంగారెడ్డి జిల్లా జహీరాబాద్​ మండలంలోని పలు గ్రామాల్లో ఆరో విడత హరితహారం కార్యక్రమాన్ని ఎమ్మెల్యే మాణిక్​రావు ప్రారంభించారు. అధికారులు, ప్రజాప్రతినిధులతో కలిసి మొక్కలు నాటారు.

mla manikrao participated in harithahaaram program in jaheerabad
'నాటిన ప్రతీ మొక్కను రక్షించుకున్నప్పుడు లక్ష్యం నెరవేరుతుంది'

By

Published : Jun 27, 2020, 5:18 PM IST

నాటిన ప్రతి మొక్కను బతికించు కున్నప్పుడే హరితహారం లక్ష్యం నెరవేరుతుందని జహీరాబాద్ ఎమ్మెల్యే మాణిక్ రావు తెలిపారు. సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ మండలం బూర్దిపాడు, బూచినెల్లి, తూముకుంట గ్రామాల్లో ఆరో విడత హరితహారం కార్యక్రమాన్ని ఎమ్మెల్యే ప్రారంభించారు. జిల్లా పశుసంవర్ధక శాఖ జేడీ రామారావు రాథోడ్, ప్రజాప్రతినిధులు, అధికారులతో కలిసి మొక్కలు నాటారు.

లక్ష్యానికి అనుగుణంగా మొక్కలు నాటి సంగారెడ్డి జిల్లాలో ఆదర్శ నియోజకవర్గంగా నిలిచేలా అధికారులు కృషి చేయాలని సూచించారు. గతేడాది హరిత హారంలో ఎమ్మెల్యే నాటిన మొక్క ఏపుగా ఎదగడాన్ని చూసి హర్షించారు.

ఇదీ చూడండి:ఆ ఒక్క కారణంతో 18 వేల మంది ఖైదీలు విడుదల

ABOUT THE AUTHOR

...view details