తెలంగాణ

telangana

వరద మృతుల కుంటుంబాలకు ఎమ్మెల్యే మాణిక్​రావు ఆర్ధికసాయం

By

Published : Nov 10, 2020, 11:06 AM IST

భారీ వర్షాలతో వరదలకు గల్లంతైన మృతుల కుటుంబాలకు ఎమ్మెల్యే మాణిక్‌రావు ప్రభుత్వం తరఫున ఆర్ధికసాయం అందించారు. సంగారెడ్డి జిల్లా సత్వాపూర్​లోని గతనెలలో పీతిరి వాగులో కొట్టుకుపోయిన ఓ వ్యక్తి కుటుంబానికి రూ.4 లక్షల చెక్కును అందజేశారు.

mla manikrao cheques distribution to the flood victims at zaheerabad in sangareddy district
వరద మృతుల కుంటుంబాలకు ఎమ్మెల్యే మాణిక్​రావు ఆర్ధికసాయం

సంగారెడ్డి జిల్లా జహీరాబాద్‌ మండలం సత్వార్‌లో గత నెల 18న పీతిరి వాగులో కొట్టుకుపోయి మృతి చెందిన రాజు కుటుంబానికి ప్రభుత్వం తరఫున రూ. 4 లక్షల చెక్కును ఎమ్మెల్యే మాణిక్​రావు అందజేశారు. పేదలకు అండగా ఎల్లవేళలా కేసీఆర్‌ సర్కారు ఉంటుందని ఎమ్మెల్యే గుర్తుచేశారు.

పెద్ద దిక్కును కోల్పోయిన ఆ బాధిత కుటుంబాన్ని ఆయన పరామర్శించారు. ఇచ్చిన హామీ ప్రకారం ఆర్థిక సహాయం అందించిన ఎమ్మెల్యేకు మృతుడి కుటుంబీకులు ధన్యవాదాలు తెలిపారు.

ఇదీ చూడండి:'వరద బాధితులకు సాయం పంపిణీ చేయకపోతే కాలనీల్లో తిరగనివ్వం'

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details