సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ మండలం సత్వార్లో గత నెల 18న పీతిరి వాగులో కొట్టుకుపోయి మృతి చెందిన రాజు కుటుంబానికి ప్రభుత్వం తరఫున రూ. 4 లక్షల చెక్కును ఎమ్మెల్యే మాణిక్రావు అందజేశారు. పేదలకు అండగా ఎల్లవేళలా కేసీఆర్ సర్కారు ఉంటుందని ఎమ్మెల్యే గుర్తుచేశారు.
వరద మృతుల కుంటుంబాలకు ఎమ్మెల్యే మాణిక్రావు ఆర్ధికసాయం
భారీ వర్షాలతో వరదలకు గల్లంతైన మృతుల కుటుంబాలకు ఎమ్మెల్యే మాణిక్రావు ప్రభుత్వం తరఫున ఆర్ధికసాయం అందించారు. సంగారెడ్డి జిల్లా సత్వాపూర్లోని గతనెలలో పీతిరి వాగులో కొట్టుకుపోయిన ఓ వ్యక్తి కుటుంబానికి రూ.4 లక్షల చెక్కును అందజేశారు.
వరద మృతుల కుంటుంబాలకు ఎమ్మెల్యే మాణిక్రావు ఆర్ధికసాయం
పెద్ద దిక్కును కోల్పోయిన ఆ బాధిత కుటుంబాన్ని ఆయన పరామర్శించారు. ఇచ్చిన హామీ ప్రకారం ఆర్థిక సహాయం అందించిన ఎమ్మెల్యేకు మృతుడి కుటుంబీకులు ధన్యవాదాలు తెలిపారు.
ఇదీ చూడండి:'వరద బాధితులకు సాయం పంపిణీ చేయకపోతే కాలనీల్లో తిరగనివ్వం'