నియోజకవర్గంలో కొవిడ్ పరిస్థితులపై ఎమ్మెల్యే మాణిక్ రావు సమీక్ష నిర్వహించారు. సంగారెడ్డి జిల్లా జహీరాబాద్లోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఆర్డీఓ రమేశ్ బాబుతో కలిసి కొవిడ్ పరీక్షలు, పాజిటివ్ రేటు, వ్యాక్సినేషన్ ప్రక్రియపై ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల వైద్యుల నుంచి వివరాలు అడిగి తెలుసుకున్నారు.
రాపిడ్ కిట్ల కొరత, వ్యాక్సినేషన్ అవాంతరాలపై ఎమ్మెల్యే ఆరా తీశారు. వ్యాక్సిన్ కోసం పీహెచ్సీలకు వచ్చే ప్రజలు భౌతిక దూరం పాటించేలా ఏర్పాట్లు చేసుకోవాలని సూచించారు. టీకా కోసం వచ్చి కరోనా అంటించుకుని వెళ్లే పరిస్థితులు రావొద్దన్నారు.