తెలంగాణ

telangana

ETV Bharat / state

పటాన్​చెరు నియోజకవర్గంలో ఎమ్మెల్యే మహిపాల్​రెడ్డి పర్యటన - ఎమ్మెల్యే మహిపాల్​రెడ్డి తాజా వార్తలు

సంగారెడ్డి జిల్లా పటాన్​చెరు మండలంలో ఎమ్మెల్యే మహిపాల్​రెడ్డి సుడిగాలి పర్యటన చేశారు. సుమారు 17 గ్రామ పంచాయతీల్లో డంపింగ్ యార్డులు, వైకుంఠధామాలను ప్రారంభించారు.

MLA Mahipal Reddy visits Patan Cheru constituency
పటాన్​చెరు నియోజకవర్గంలో ఎమ్మెల్యే మహిపాల్​రెడ్డి పర్యటన

By

Published : Jul 19, 2020, 10:04 AM IST

నియోజక వర్గంలోని అన్ని గ్రామ పంచాయతీల్లో అభివృద్ధి పనులు శరవేగంగా జరుగుతున్నాయని ఎమ్మెల్యే మహిపాల్​రెడ్డి పేర్కొన్నారు. సంగారెడ్డి జిల్లా పటాన్​చెరు మండలంలోని పలు గ్రామాల్లో సుడిగాలి పర్యటన చేశారు. ఈ సందర్భంగా ఆయా గ్రామాల్లో నిర్మాణాలు పూర్తయిన డంపింగ్​ యార్డులు, వైకుంఠధామాలను ఆయన ప్రారంభించారు.

సీఎం కేసీఆర్ నాయకత్వంలో పల్లెలకు మహర్దశ వచ్చిందని ఎమ్మెల్యే పేర్కొన్నారు. నియోజకవర్గంలోని అన్ని గ్రామాల్లోనూ డంపింగ్​ యార్డుల నిర్మాణాలను పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తెచ్చామని తెలిపారు. మెజార్టీ గ్రామాల్లో వైకుంఠదామాల నిర్మాణాలు సైతం పూర్తయ్యాయని అన్నారు. ప్రతి గ్రామంలో అన్ని రకాల మౌలిక వసతులు కల్పిస్తూ, ప్రజలకు పారదర్శకమైన పాలన అందిస్తున్నట్లు ఆయన వివరించారు.

ఇదీచూడండి: 'పాఠశాలలు తెరిచేది ఆగస్టులో కాదు... సెప్టెంబర్​లో'

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details