రైతును రాజును చేయడమే లక్ష్యంగా తెరాస ప్రభుత్వం పని చేస్తుందని పటాన్చెరు ఎమ్మెల్యే మహిపాల్రెడ్డి పేర్కొన్నారు. సంగారెడ్డి జిల్లా లక్డారం గ్రామ పరిధిలో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా రైతులు పండించిన ప్రతి గింజనూ కొనుగోలు చేయాలని అధికారులకు సూచించారు.
రైతును రాజు చేయడమే తెరాస లక్ష్యం: మహిపాల్రెడ్డి - లక్డారంలో ధాన్యం కొనుగోలు కేంద్రం ప్రారంభించిన ఎమ్మెల్యే వార్తలు
సంగారెడ్డి జిల్లా లక్డారం గ్రామ పరిధిలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఎమ్మెల్యే మహిపాల్రెడ్డి ప్రారంభించారు. రైతులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.
![రైతును రాజు చేయడమే తెరాస లక్ష్యం: మహిపాల్రెడ్డి MLA Mahipal Reddy inaugurated the grain purchasing center](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-9379010-506-9379010-1604137554948.jpg)
రైతును రాజు చేయడమే తెరాస లక్ష్యం: మహిపాల్రెడ్డి
రైతును వెన్నెముకగా గుర్తించిన ముఖ్యమంత్రి కేసీఆర్.. సంక్షేమ పథకాల ద్వారా వారిని ఆదుకున్నారని ఎమ్మెల్యే గుర్తు చేశారు. రైతుల కోసం ప్రారంభించిన ఈ ధాన్యం కొనుగోలు కేంద్రాలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.