తెలంగాణ

telangana

By

Published : Apr 18, 2020, 10:07 PM IST

ETV Bharat / state

నారాయణఖేడ్ మున్సిపల్ సిబ్బందికి నిత్యావసరాల పంపిణీ

నారాయణఖేడ్ పట్టణంలో ఇంటింటికీ మాస్కుల పంపిణీ కార్యక్రమం చేపట్టబోతున్నట్లు స్థానిక ఎమ్మెల్యే భూపాల్ రెడ్డి తెలిపారు. దాత కాశీనాథ్ సహకారంతో మున్సిపల్ సిబ్బందికి నిత్యావసర వస్తువులు పంపిణీ చేసే కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు.

bhupal reddy distributed food items and mask sand sanitisers to narayankhed municipal employees
నారాయణఖేడ్ మున్సిపల్ సిబ్బందికి నిత్యావసరాల పంపిణీ

సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ మున్సిపల్ కార్యాలయంలో దాత కాశీనాథ్ సహకారంతో మున్సిపల్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో సిబ్బందికి నిత్యావసరాలు, మాస్కులు, శానిటైజర్లు, సబ్బులు పంపిణీ చేశారు. లాక్‌డౌన్‌కు ప్రజల నుంచి సహకారం లభిస్తోందని ఎమ్మెల్యే భూపాల్ రెడ్డి పేర్కొన్నారు. మున్సిపాలిటీ పరిధిలోని ప్రతి ఇంటికీ మాస్కులు పంపిణీ చేసే కార్యక్రమాన్ని త్వరలో చేపట్టబోతున్నట్లు ఎమ్మెల్యే తెలిపారు. ఈ ఆపత్కాలంలో మున్సిపల్ సిబ్బంది అందిస్తున్న సేవలు మరువలేనివని కొనియాడారు.

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details