తెలంగాణ

telangana

By

Published : Jan 30, 2021, 1:52 PM IST

ETV Bharat / state

మహాత్ముని బాటలో నడవండి: మంత్రి హరీశ్​రావు

సంగారెడ్డి జిల్లాలో గాంధీ విగ్రహానికి మంత్రి హరీశ్ రావు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అమరవీరుల సంస్మరణ దినోత్సవం సందర్భంగా మౌనం పాటించారు.

Minister Harish Rao laid a wreath at the Gandhi statue on the occasion of Gandhi's death at the ZP office in Sangareddy district
మహాత్ముడి బాటలో నడవండి: మంత్రి హరీష్ రావు

సంగారెడ్డి జిల్లా పరిషత్‌ కార్యాలయంలో మంత్రి హరీష్ రావు గాంధీ వర్ధంతి సందర్భంగా.. గాంధీ విగ్రహానికి పూల మాలలు వేసి నివాళులు అర్పించారు. గాంధీజీ సత్యం, ధర్మం, అహింసా మార్గంలో ప్రయాణించి దేశ స్వాతంత్య్రానికి కృషి చేశారన్న మంత్రి.. ఆ .. మహాత్ముడి బాటలో ప్రయాణించాలన్నారు.

అనంతరం అమరవీరుల సంస్మరణ దినోత్సవాన్ని స్మరించుకుంటూ మౌనం పాటించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేలు మనిక్‌ రావు, భూపాల్ రెడ్డి, జిల్లా పరిషత్ ఛైర్మన్ మంజుశ్రీ తదితరులు పాల్గొన్నారు.

ఇదీ చదవండి:అహింసతో స్వతంత్ర సంగ్రామాన్ని ఉరకలెత్తించారు : సీఎం కేసీఆర్

ABOUT THE AUTHOR

...view details