తెలంగాణ

telangana

ETV Bharat / state

నోరూరించే 'చిరు' రొట్టెలు - deccan developement society

చిరుధాన్యాలతో తయారు చేసిన ఆహార పదార్థాలను తినాలనుకుంటున్నారా..? కానీ ఎలా తయారు చేయాలో మీకు తెలీదా..?మరెందుకు ఆలస్యం ఈ వీడియో చూడండి..!

కెఫె ఎథ్నిక్​ రెస్టారెంట్

By

Published : Feb 3, 2019, 8:04 PM IST

కెఫె రెస్టారెంట్​లో రొట్టెల పండుగ
నేటి తరం.. ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ పెడుతున్నారు. పిజ్జాలు, బర్గర్లకు దూరంగా ఉంటూ ఆర్గానిక్​ ఆహారానికి జై కొడుతున్నారు. చిరుధాన్యాల వినియోగంపై అవగాహన లేనివారి కోసం డీడీఎస్​ సంస్థ ఫుడ్​ ఫెస్టివల్ ఏర్పాటు చేసింది. వంటల రుచి చూపిస్తూనే.. ఎలా తయారు చేయాలో నేర్పిస్తోంది.

14 ఏళ్ల క్రితం కెఫే ఎథ్నిక్​ పేరుతో రెస్టారెంట్​నూ ప్రారంభించారు. చిరుధాన్యాలతో చేసిన వంటకాలను ప్రజలకు చేరువ చేస్తున్నారు. జనవరిలో మిల్లెట్స్​ దోశ ఫెస్ట్​ నిర్వహించారు. ఫిబ్రవరిలో రొట్టెల పండుగ జరుపుతున్నారు.

జొన్న, గోధుమ, బెరికె, సజ్జ, నువ్వులు, పాలకూర, మెంతికూర, సోరకాయ రొట్టెలను తయారు చేస్తున్నారు. వీటితో పాటు రాగి, మల్టీ మిల్లెట్​ దోశ, పులిహోర, కొర్ర బిర్యానీ, జొన్న పెసర ఇడ్లీ, అనుప గుడాలు, మిల్లెట్​ పకోడి వంటి భిన్నరుచులు అందిస్తున్నారు.

పదార్థాల్లో ఉండే పౌష్ఠిక విలువలు వివరిస్తూనే ఎలా తయారు చేయాలో చెబుతున్నారు. ఈ ఫెస్ట్​కు రాష్ట్ర నలుమూలల నుంచి భోజన ప్రియులు తరలొచ్చి లొట్టలేసుకుంటు తింటున్నారు.

మొదటి ఆరు నెలలు కెఫే ఎథ్నిక్​లో ఫుడ్ ఫెస్టివల్స్ నిర్వహిస్తోంది డీడీఎస్​ సంస్థ. తర్వాతి ఆరు నెలలు రాష్ట్ర వ్యాప్తంగా 50 ప్రాంతాలను ఎంపిక చేసి ఆహారోత్సవాలను ఏర్పాటు చేసేందుకు సిద్ధం అవుతోంది.

ABOUT THE AUTHOR

...view details