తెలంగాణ

telangana

ETV Bharat / state

పిచ్చికుక్క దాడిలో 48 మందికి గాయాలు

పిచ్చికుక్క స్వైర విహారం 48 మందిని ఆసుపత్రికి పంపింది. పిచ్చిపట్టిన ఓ శునకం..దారిన పోయే వారినే కాదు.. ఇంట్లో ఉన్న వారిని గాయపరిచింది. ఈ ఘటన సంగారెడ్డి జిల్లా పటాన్​చెరులో చోటుచేసుకుంది.

By

Published : Apr 16, 2019, 2:30 PM IST

Updated : Apr 16, 2019, 7:01 PM IST

పిచ్చికుక్క దాడి

సంగారెడ్డి జిల్లా పటాన్​చెరులో పిచ్చికుక్క స్వైర విహారం

పిచ్చికుక్క స్వైర విహారం 48 మందిని ఆసుపత్రికి పంపింది. పిచ్చిపట్టిన ఓ శునకం..దారిన పోయే వారినే కాదు.. ఇంట్లో ఉన్న వారిని గాయపరిచింది. ఈ ఘటన సంగారెడ్డి జిల్లా పటాన్​చెరులో చోటుచేసుకుంది.
పటాన్​చెరులో పిచ్చికుక్క దాడిలో 48 మందికి గాయాలు
సంగారెడ్డి జిల్లా పటాన్​చెరులో ఓ పిచ్చికుక్క స్వైర విహారం చేసింది. గత రాత్రి నుంచి 48మందిని కరిచి తీవ్రంగా గాయపరిచింది. పట్టణ పరిధిలోని కాలనీల్లో తిరుగుతూ దారిన పోయే వారినే కాకుండా ఇళ్లల్లో ఉన్నవారిని కూడా కరిచింది.
ఏమరుపాటుగా ఉన్న సమయంలో వెనుక నుంచి వచ్చి పిచ్చికుక్క దాడి చేసిందని బాధితులు వాపోయారు. స్థానికంగా కుక్కల భయం ఉందని.. పంచాయతీ సిబ్బంది పట్టించుకోవడం లేదని ఆరోపించారు.

వ్యాక్సిన్​ కొరత లేదు

బాధితులు పటాన్​చెరు ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స చేయించుకున్నారు. బాధితులకు చికిత్స అందిస్తున్నామని ఆస్పత్రి ఆర్​ ఎం కిష్టయ్య తెలిపారు. రేబిస్​ వ్యాక్సిన్​ సరిపడా అందుబాటులో ఉందన్నారు.
ఈ ఘటనతో అక్కడి స్థానికులు భయాందోళనలకు గురయ్యారు. స్థానికులు ఆ పిచ్చికుక్కను పట్టుకుని కొట్టి చంపారు. ఇకనైనా పంచాయతీ అధికారులు స్పందించి కుక్కల బెడద నుంచి తమను రక్షించాలని కోరుతున్నారు.

ఇదీ చదవండి : నేడు రెవెన్యూ సంఘాల అత్యవసర సమావేశం

Last Updated : Apr 16, 2019, 7:01 PM IST

ABOUT THE AUTHOR

...view details