తెలంగాణ

telangana

ETV Bharat / state

గుడ్​న్యూస్: మిడతల దండు దిశను మార్చుకుందట! - మిడతల దండు దక్షిణాదికి రావని ఇక్రిశాట్​ శాస్త్రవేత్త జగదీశ్​ చెప్పారు

దక్షిణాది రాష్ట్రాలకు మిడతల ముప్పు తప్పినట్టేనని ఇక్రిశాట్ శాస్త్రవేత్తలు అంచనా వేస్తున్నారు. గాలి వాటంతో ప్రయాణించే మిడతలు రుతుపవనాల ప్రభావం వల్ల దిశను మార్చుకున్నాయని స్పష్టం చేస్తున్నారు. దేశంలోని అన్ని వ్యవసాయ పరిశోధన సంస్థలు మిడతల నివారణపై ప్రయోగాలు చేస్తున్నాయంటున్న ఇక్రిశాట్ కీటక శాస్త్రవేత్త జగదీశ్‌తో మా ప్రతినిధి క్రాంతికుమార్ ముఖాముఖి.

Locusts are not attack in south India reason spoke by icrisat scientist jagadeesh
మిడతల దండు దిశను మార్చుకున్నాయ్​: ఇక్రిశాట్ శాస్త్రవేత్త జగదీశ్‌

By

Published : Jun 3, 2020, 5:27 PM IST

మిడతల దండు దిశను మార్చుకున్నాయ్​: ఇక్రిశాట్ శాస్త్రవేత్త జగదీశ్‌

మిడతలు ఒక ప్రాంతం నుంచి మరొక ప్రాంతానికి వలస వెళ్లడానికి గల కారణాలేంటి?

  • వాటికి ఆహారం లేక, గుడ్లు పొదగడానికి, ఎండ వేడిమి తట్టుకోలేక వర్షానికి, గాలివాటానికి అనుగుణంగా ఇవి ఒక ప్రాంతం నుంచి మరొక ప్రాంతానికి వలస వెళ్తాయి.

మిడతల దండును తగ్గించే సహజ శత్రువులంటూ లేవా?

  • మిత్ర పురుగులు, పక్షులు, పురుగులు ఉంటాయి అవి ఈ మిడతలను తింటాయి. లిస్టర్​ బిట్టిల్​ వంటివి కూడా వీటిి గుడ్లను తినేస్తాయి.

సిద్దిపేటలోని కొన్ని పొలాలను మిడతలు తినేశాయి. అవి ఈ ఎడారి మిడతలు కాదంటున్నారు. మరి అవి ఏంటి?

  • వర్షం వస్తే ఇంతకు ముందే గుడ్లు పెట్టిన వేరే రకం మిడతల గుడ్లు పొదగబడి అవి పెరిగి ఇలా పొలాలను తినేశాయి. ఆ మిడతలు ఈ దండు ఒకటి కాదు.

ఈ దండును అడ్డుకోవడానికి ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకుంటే బాగుంటుంది?

  • రైతులను ఏకం చేసి వారికి అవగాహన కల్పించాలి. ఈ మిడతలు రాత్రి వేళ క్రియాశీల రహితంగా ఉంటాయి. ఆ సమయాల్లో వేప రసాయనం పిచికారీ చేయడం, పొగపెట్టడం వంటి కార్యక్రమాలు చేపట్టాలి.

నాగ్​పూర్​దగ్గర ఆగిపోయాయంటున్నారు? మళ్లీ దక్షిణాదికి వచ్చే అవకాశం ఉందా?

  • ప్రస్తుత పరిణామాల్లో ఇప్పుడు నాగ్​పూర్​ నుంచి దక్షిణాదికి వచ్చే గాలివాటం మరలింది. కాబట్టి ఈ పరిస్థితుల్లో ఎడారి మిడతల దండు ఇటువైపుకి వచ్చే అవకాశం లేదు.

ఇవీ చూడండి:కేంద్ర విద్యుత్తు చట్టంపై కేసీఆర్ గుస్సా..

ABOUT THE AUTHOR

...view details