తెలంగాణ

telangana

By

Published : May 28, 2021, 12:41 PM IST

ETV Bharat / state

lockdown: పోలీస్ సైరన్ వినిపిస్తేనే.. దుకాణాలు బంద్

సంగారెడ్డి జిల్లాలో లాక్​డౌన్ పకడ్బందీగా అమలవుతోంది. కానీ కొందరు వ్యాపారస్తులు ఉదయం 10 దాటాక కూడా దుకాణాలను మూయట్లేదు. పోలీసులు వస్తేనే లాక్​డౌన్​ నిబంధనలను పాటిస్తున్నారు.

lockdown implementation in sangareddy
పోలీస్ సైరన్ వినిపిస్తేనే.. దుకాణాలు బంద్

సంగారెడ్డి నియోజకవర్గంలోని వ్యాపారస్తులు ముగింపు సమయంలో పోలీసులు సైరన్ మోగిస్తే తప్ప దుకాణాలు మూయడం లేదు. ఉదయం 10 దాటినా వ్యాపారాలు కొనసాగిస్తున్నారు. లాక్​డౌన్ సడలింపు సమయం దాటాక అన్ని దుకాణాలు మూసేయాలని పోలీసులు ఎంతగా చెప్పినప్పటికీ... వ్యాపారులు మాత్రం వినడం లేదు.

కరోనాను కట్టడి చేయాలంటే లాక్​డౌన్ నిబంధనలు పాటించాలని పోలీసులు చెబుతున్నారు. కేవలం సడలింపు సమయంలో మాత్రమే అన్ని పనులు చేసుకోవాలని ఉదయం 10 దాటాక ఒక్కరు కూడా బయట కనిపించకూడదని అన్నారు. అత్యవసరమైతే తప్ప బయటకు రాకూడదని... ఒకవేళ వచ్చినా మాస్కు ధరించి, భౌతిక దూరం పాటించాలని సూచించారు.

ఇదీ చదవండి :Lockdown Effect: ఆర్థిక సుడిగుండంలో కూరగాయల రైతు

ABOUT THE AUTHOR

...view details