తెలంగాణ

telangana

ETV Bharat / state

లాక్​డౌన్‌ పేరుతో తొలగించారని రిలే నిరాహార దీక్ష - సంగారెడ్డి జిల్లా తాజా వార్తలు

సంగారెడ్డి జిల్లా కంది మండలంలో ఆశా కో కార్మికులు రిలే నిరాహార దీక్ష చేపట్టారు. కార్మికులను లాక్​డౌన్ పేరుతో తొలగించారని, సరైన కాలంలో వేతనాలు చెల్లించడం లేదని ఆరోపించారు. కార్మికుల డిమాండ్లు నెరవేర్చాలని సీఐటీయూ నాయకులు హెచ్చరించారు.

లాక్‌ డౌన్‌ పేరుతో తొలగించారని కార్మికుల రిలే నిరాహార దీక్ష
లాక్‌ డౌన్‌ పేరుతో తొలగించారని కార్మికుల రిలే నిరాహార దీక్ష

By

Published : Jul 6, 2020, 2:38 PM IST

సంగారెడ్డి జిల్లా కంది మండలంలోని ఆశా కో పరిశ్రమలోని కార్మికులను లాక్​డౌన్ పేరుతో తొలగించారని సీఐటీయూ ఆధ్వర్యంలో రిలే నిరాహార దీక్ష చేపట్టారు. అలాగే సరైన కాలంలో వేతనాలు చెల్లించడంలేదని పరిశ్రమ ఎదుట నిరసన తెలిపారు.

బకాయి వేతనాలను చెల్లించాలని, అందరూ కార్మికులను మళ్ళీ విధుల్లోకి తీసుకోవాలని డిమాండ్ చేశారు. కార్మికులకు న్యాయం జరగకపోతే ఊరుకునేది లేదని, వెంటనే వారి డిమాండ్లు నెరవేర్చాలని సీఐటీయూ నాయకులు హెచ్చరించారు.

ఇదీ చదవండి:మిడతల దాడులను 'ప్రకృతి విపత్తు'గా ప్రకటించాలి: కాంగ్రెస్

ABOUT THE AUTHOR

...view details