తెలంగాణ

telangana

By

Published : Apr 21, 2020, 12:45 PM IST

ETV Bharat / state

'లబ్ధిదారుల ఇళ్లకు వెళ్లి కల్యాణలక్ష్మి చెక్కుల పంపిణీ'

కరోనా వంటి ఆపత్కర పరిస్థితుల్లోనూ రాష్ట్ర ప్రభుత్వం తన కర్తవ్యం నెరవేరుస్తోందని జహీరాబాద్​ ఎమ్మెల్యే మాణిక్​ రావు అన్నారు. సంగారెడ్డి జిల్లా న్యాల్కల్​ మండలంలోని పలు గ్రామాలకు చెందిన 15 మంది లబ్ధిదారుల ఇళ్లకు వెళ్లి కల్యాణ లక్ష్మి చెక్కులు పంపిణీ చేశారు.

mla manik rao distributed kalyana laxmi cheques
జహీరాబాద్​లో కల్యాణ లక్ష్మి చెక్కుల పంపిణీ

కరోనా కష్టాల్లోనూ రాష్ట్ర ప్రభుత్వం సంక్షేమ పథకాలు లబ్ధిదారులకు చేరవేస్తోందని జహీరాబాద్​ ఎమ్మెల్యే మాణిక్​ రావు అన్నారు. సంగారెడ్డి జిల్లా న్యాల్కల్ మండలంలో ఎమ్మెల్సీ ఫరీదుద్దీన్​తో కలిసి పర్యటించారు.

లాక్డౌన్ నేపథ్యంలో లబ్దిదారుల ఇళ్లకు వెళ్లి పలు గ్రామాల్లో 15 మంది లబ్దిదారులకు కల్యాణలక్ష్మి చెక్కులు పంపిణీ చేశారు. ప్రజా ఆరోగ్యం కోసం అమలు చేస్తున్న లాక్​డౌన్​కు అందరూ సహకరించాలని ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ కోరారు.

ABOUT THE AUTHOR

...view details