తెలంగాణ

telangana

ETV Bharat / state

నేను ఆ మాటపైనే కట్టుబడి ఉంటా: జగ్గారెడ్డి

శాంత స్వభావుడైనా మహాత్మాగాంధీపై భాజపా ఎంపీలు విమర్శలు చేయడం సరికాదని సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి అన్నారు. భాజపా ఎంపీలు ఓవైపు గాంధీపై విమర్శలు చేస్తునే... మరోవైపు స్వచ్ఛభారత్​ పథకంలో గాంధీ చిత్రపటాలతో ర్యాలీలు చేస్తున్నారని మండిపడ్డారు.

By

Published : Feb 6, 2020, 8:12 PM IST

Updated : Feb 7, 2020, 12:19 AM IST

Jagga Reddy talk about mahatma gandhi in gandhi bhavan
నేను ఆ మాటపైనే కట్టుబడి ఉంటా: జగ్గారెడ్డి

మూడు నెలలపాటు రాజకీయాల జోలికి వెళ్లనన్న మాటపై తాను కట్టుబడి ఉంటున్నట్లు సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి స్పష్టం చేశారు. శాంతి స్వరూపుడైన మహాత్మాగాంధీ ప్రతి ఇంట్లో పుట్టాలని కోరుకుంటున్నట్లు ఆయన చెప్పారు. భగత్​సింగ్​- చంద్రశేఖర్​ ఆజాద్​లు స్వేచ్ఛ కోసం పోరాటం చేసినా... వాళ్లు దానిని చూడలేకపోయారని పేర్కొన్నారు.

భాజపా ఎంపీలు గాంధీ కంటే గాడ్సే బెటర్​ అని మాట్లాడుతున్నారని జగ్గారెడ్డి ఆరోపించారు. ఓవైపు గాంధీపై భాజపా ఎంపీలు విమర్శలు చేస్తూనేే... మరోవైపు స్వచ్ఛభారత్​ విషయంలో గాంధీ చిత్రపటాలతో ర్యాలీలు చేస్తున్నారని ఎద్దేవా చేశారు.

నేను ఆ మాటపైనే కట్టుబడి ఉంటా: జగ్గారెడ్డి

ఇదీ చూడండి:'మహా'వస్థ: మేడారంలో తాగునీటి తండ్లాట!

Last Updated : Feb 7, 2020, 12:19 AM IST

ABOUT THE AUTHOR

...view details