తెలంగాణ

telangana

ETV Bharat / state

ఆ వరస హత్యలు చేసింది సైకో కిల్లరా?

సంగారెడ్డి జిల్లాలో ఈ నెల 6, 7 తేదీల్లో జరిగిన వరుస హత్య కేసుల దర్యాప్తులో పోలీసులు వేగం పెంచారు. సీసీ ఫుటేజీలో గుర్తించిన అనుమానితుడి కోసం గాలింపు ముమ్మరం చేశారు.

By

Published : Feb 12, 2020, 12:43 PM IST

Investigation into a series of murders
ముమ్మరంగా సంగారెడ్డి వరుస హత్యల దర్యాప్తు

ముమ్మరంగా సంగారెడ్డి వరుస హత్యల దర్యాప్తు

సంగారెడ్డి జిల్లా పటాన్​చెరు మండలం రుద్రారం పరివార్ దాబా వద్ద ఈనెల 6న జరిగిన ఇద్దరు గైడ్​ల హత్య, మరుసటి రోజు సంగారెడ్డిలో జరిగిన మరో యువకుడి హత్య కేసు దర్యాప్తులో పోలీసులు వేగం పెంచారు. జిల్లాలో ఈ మూడు హత్యలూ ఒకరోజు వ్యవధిలోనే జరగడం వల్ల.. ఈ మూడింటినీ ఒక్కరే చేసి ఉంటారనే కోణంలో పోలీసులు ఆరా తీస్తున్నారు.

విచారణలో భాగంగా సీసీ కెమెరాల ఆధారంగా కనిపెట్టిన ఆర్​15 v2 మోడల్ బైక్ కోసం గాలిస్తున్నారు. హత్య చేసిన తర్వాత నిందితుడు ఇదే బైక్​పై అనుమానాస్పద ప్రాంతాల్లో తిరిగినట్లుగా సీసీ కెమెరాల్లో నమోదైంది.

మరోవైపు ఈ హత్యలకు పాల్పడిన వాడు సైకో కిల్లర్​ అయి ఉంటాడని అనుమానం వ్యక్తమవుతోంది.

ఇవీ చూడండి: వరంగల్​ అర్బన్​ జిల్లాలో రోడ్డు ప్రమాదం... ముగ్గురి దుర్మరణం

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details