తెలంగాణ

telangana

ఇంటర్మీడియట్ విద్యార్థిని అదృశ్యం

ఇంటర్మీడియట్ పరీక్ష రాయడానికి వెళ్లిన ఓ విద్యార్థిని అదృశ్యమైంది. ఆందోళనకు గురైన విద్యార్థిని తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.

By

Published : Mar 18, 2020, 11:10 PM IST

Published : Mar 18, 2020, 11:10 PM IST

inter student missing in ratancheru
ఇంటర్మీడియట్ విద్యార్థిని అదృశ్యం

ఇంటర్మీడియట్ పరీక్ష రాసేందుకు వెళ్ళి ఓ యువతి అదృశ్యమైన ఘటన సంగారెడ్డి జిల్లా పటాన్​చెరు ఠాణా పరిధిలో చోటుచేసుకుంది. జిల్లాలోని కొల్లూరుకు చెందిన ఎట్టయ్య కుమార్తె శ్వేత.. ఇంటర్ మొదటి సంవత్సరం పరీక్షలు రాస్తోంది. ఈనెల 17న పరీక్ష రాసేందుకు ఉదయం ఏడు గంటలకు ఇంటి నుంచి బయలుదేరింది. పరీక్ష అనంతరం ఇంటికి వస్తున్నానని తల్లికి ఫోన్ చేసి చెప్పింది. అప్పటి నుంచి శ్వేత ఫోన్ స్విచ్ఛాఫ్ వస్తోందని తల్లిదండ్రులు తెలిపారు. యువతి కనిపించకపోవడం వల్ల పటాన్​చెరు పోలీస్​స్టేషన్​లో ఫిర్యాదు చేశారు.

ABOUT THE AUTHOR

...view details