తెలంగాణ

telangana

ETV Bharat / state

సంగారెడ్డిలో రెపరెపలాడిన త్రివర్ణ పతాకం

సంగారెడ్డి జిల్లాలో 73వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. పోలీస్ పరేడ్ మైదానంలో జిల్లా పరిషత్ అధ్యక్షురాలు మంజుశ్రీ జెండా ఆవిష్కరించారు.

By

Published : Aug 15, 2019, 5:41 PM IST

సంగారెడ్డి


సంగారెడ్డి జిల్లాలో 73వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. వాడ వాడన త్రివర్ణ పతాకం రెపరెపలాడింది. జిల్లా కేంద్రంలోని పోలీస్ పరేడ్ మైదానంలో జిల్లా పరిషత్ అధ్యక్షురాలు మంజుశ్రీ జెండా ఆవిష్కరించారు. పోలీసుల గౌరవ వందనం స్వీకరించిన అనంతరం స్వాతంత్య్ర సమరయోధులను సన్మానించారు. జిల్లాలో జరుగుతున్న అభివృద్ధి పనులు, ప్రభుత్వ కార్యక్రమాలను తన ప్రసంగంలో ప్రజలకు వివరించారు. వివిధ శాఖలు శకటాలు ప్రదర్శించాయి. విద్యార్థుల సాంస్కృతిక ప్రదర్శనలు ప్రజలను ఆకట్టుకున్నాయి. సమీకృత కలెక్టరేట్​లో పాలనాధికారి జెండా ఆవిష్కరించారు. కలెక్టర్ హన్మంతరావుకు, ఎస్పీ చంద్రశేఖర్ రెడ్డికి జిల్లా పరిషత్ ఛైర్​పర్సన్ రాఖీ కట్టి శుభాకాంక్షలు తెలిపారు.

రెపరెపలాడిన త్రివర్ణ పతాకం

ABOUT THE AUTHOR

...view details