తెలంగాణ

telangana

ETV Bharat / state

విజయ డైరీని రైతులు కాపాడుకోవాలి: హరీశ్​ రావు - Harish Rao latest news in Sangareddy district

విజయ డైరీ రైతులకు ప్రభుత్వం తీపి కబురు చెప్పింది. వారికి ఇచ్చే ప్రోత్సాహకాలు వారం రోజుల్లో ఖాతాల్లో జమవుతాయని మంత్రి హరీశ్​ రావు స్పష్టం చేశారు. ఇందుకోసం రూ.40కోట్లు విడుదల చేశామని తెలిపారు. డైరీకి రైతులు పాలు పోసి కాపాడుకోవాలని సూచించారు.

Harish Rao visits Narayankhed constituency
నారాయణఖేడ్ నియోజకవర్గంలో పర్యటించిన హరీశ్​ రావు

By

Published : Dec 23, 2020, 3:55 PM IST

విజయ డైరీ రైతులకిచ్చే ప్రోత్సాహకాలు వారం రోజుల్లో ఖాతాల్లో జమవుతాయని ఆర్థిక మంత్రి హరీశ్​ రావు స్పష్టం చేశారు. దీనికోసం రూ.40కోట్లు విడుదల చేశామని తెలిపారు.

సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ నియోజకవర్గంలో పర్యటించి పలు అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల్లో పాల్గొన్నారు. నిజాంపేటలో రైతు వేదిక, పాల శీతలీకరణ కేంద్రాన్ని, రెండు పడకల గదుల ఇళ్లను ప్రారంభించారు.

విజయ డైరీకి రైతులు పాలు పోసి కాపాడుకోవాలి. చనిపోయిన పాడి పశువులకు బదులు మరొకటి కొనేందుకు వారం రోజుల్లో విధివిధానాలు రూపొందిస్తాం.

- హరీశ్​ రావు, ఆర్థిక మంత్రి

ఇదీ చూడండి: వ్యవసాయ రంగాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మనదే: నిరంజన్‌రెడ్డి

ABOUT THE AUTHOR

...view details