తెలంగాణ

telangana

By

Published : Oct 14, 2020, 4:20 PM IST

ETV Bharat / state

భారీ వర్షాలకు.. వంతెనలపై నుంచి ఉద్ధృతంగా వరదనీరు

సంగారెడ్డి జిల్లాలో కురుస్తున్న భారీ వర్షాలకు వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. జిల్లాలోని కొండాపూర్​- తెర్పోల్​ దారిలో ఉన్న వంతెనపై నుంచి వరద నీరు ప్రవహిస్తుండగా దాన్ని చూసిేందుకు ప్రజలు తరలివస్తున్నారు.

heavy water flow in sangareddy bridges due to rains
భారీ వర్షాలకు.. వంతెనలపై నుంచి ఉద్ధృతంగా వరదనీరు

గత మూడు రోజులుగా ఎడతెరిపిలేకుండా కురుస్తున్న వర్షాలకు సంగారెడ్డి జిల్లాలోని పలు వంతెనలపై నుంచి వరద నీరు ఉప్పొంగుతోంది. సంగారెడ్డి జిల్లాలోని కొండపూర్​ మండలం నుంచి తెర్పోల్​ వెళ్లే దారిలో ఉన్న వంతెనపై నుంచి నీరు ఉద్ధృతంగా ప్రవహిస్తోంది.

గత కొన్నేళ్లుగా ఇలాంటి దృశ్యం చూడనందున సమీప గ్రామాల్లోంచి ప్రజలు వంతెన అందాలు చూసేందుకు వస్తున్నారు. అయితే.. వరద నీరు ప్రవాహం వల్ల పక్కనే ఉన్న పంట పొలాలు దెబ్బ తింటున్నాయని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు.

ఇదీ చూడండి :'రాష్ట్రంలో వర్ష బీభత్సాన్ని జాతీయ విపత్తుగా గుర్తించాలి'

ABOUT THE AUTHOR

...view details