తెలంగాణ

telangana

ETV Bharat / state

పొరుగు రాష్ట్రాల రైతులను అడ్డుకోండి: హరీశ్ - ground nut purchase center opened

సంగారెడ్డి జిల్లా బచేపల్లిలో మంత్రి హరీశ్​ రావు శనగల కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు. జిల్లాలో 6 కొనుగోలు కేంద్రాలు అందుబాటులోకి తేనున్నట్టు తెలిపారు. ప్రతి కేంద్రంలో సబ్బు, నీటి సౌకర్యం కల్పించాలని సూచించారు.

ground nut purchase center opened in baxhepalli by minister harish rao
పొరుగు రాష్ట్రాల రైతులను అడ్డుకోండి: హరీశ్

By

Published : Mar 31, 2020, 7:42 PM IST

జిల్లాలో శనగల కొనుగోలుకు 6 కేంద్రాలు అందుబాటులోకి తెస్తున్నట్టు రాష్ట్ర ఆర్థికశాఖ మంత్రి హరీశ్​ రావు అన్నారు. సంగారెడ్డి జిల్లా కల్హేర్​ మండలం బచేపల్లిలో కొనుగోలు కేంద్రాన్ని ఆయన ప్రారంభించారు. ప్రతి కేంద్రంలో సబ్బు, నీటి సౌకర్యం కల్పించాలని సూచించారు. సమావేశంలో సామాజిక దూరం పాటించిన ఆయన... కరోనాను తరిమి కొట్టేందుకు ప్రతి ఒక్కరూ పోరాడాలన్నారు.

అనంతరం నారాయణఖేడ్​, జోగిపేట్​లో అధికారులతో మంత్రి సమీక్ష సమావేశం నిర్వహించారు. జిల్లాలో 22 వేల ఎకరాల వరి పంట కోయడానికి 200ల వరికోత యంత్రాలు అందుబాటులో ఉంచాలని అధికారులను ఆదేశించారు. ఖేడ్​, సిర్గాపూర్​, కల్హేర్​లలో జొన్న కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలన్నారు. పొరుగు రాష్ట్రాల నుంచి వచ్చే రైతులను అడ్డుకొని మన రైతులకు ప్రయోజనం కలిగేలా చర్యలు తీసుకోవాలన్నారు.

పొరుగు రాష్ట్రాల రైతులను అడ్డుకోండి: హరీశ్

ఇదీ చూడండి:'మర్కజ్​కు వెళ్లొచ్చిన ప్రతిఒక్కరూ సమాచారం ఇవ్వాలి'

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details