సంగారెడ్డి జిల్లా బొల్లారం పోలీసులు కరోనాపై వినూత్నంగా ప్రచారం చేస్తున్నారు. కరోనా వైరస్ ఆకారంలో హెల్మెట్ ధరించిన ఓ రక్షకభటుడు రోడ్డుపై వెళ్లే వారికి అవగాహన కల్పిస్తున్నాడు. ఈ వీడియోను ఎస్పీ చంద్రశేఖర్ రెడ్డి ట్విట్టర్లో పెట్టారు. గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ స్పందించారు. కొవిడ్- 19పై ప్రజలకు కొత్త తరహాలో అవగాహన కల్పించడంలో పోలీసులు చూపిన చొరవను స్వాగతిస్తూ గవర్నర్ ట్వీట్ చేశారు.
కరోనాపై పోలీసుల వినూత్న ప్రచారం... స్వాగతించిన గవర్నర్ - Governor Tweet Corona Virus
కరోనా వైరస్పై సంగారెడ్డి జిల్లా బొల్లారం పోలీసులు చేస్తున్న వినూత్న ప్రచారాన్ని గవర్నర్ తమిళిసై స్వాగతించారు. ఈ మేరకు ట్విట్టర్లో గవర్నర్ ట్వీట్ చేశారు.

గవర్నర్ ట్వీట్
కరోనాపై పోలీసుల వినూత్న ప్రచారం... స్వాగతించిన గవర్నర్