తెలంగాణ

telangana

ETV Bharat / state

ప్రభుత్వాసుపత్రిలో రోగులకు, బంధువులకు అన్నదానం

సంగారెడ్డి జిల్లా కేంద్రంలోని జిల్లా ప్రభుత్వాసుపత్రిలో జిల్లా సెషన్ న్యాయవాది పాపిరెడ్డి ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. సుమారు వందమందికి భోజనం అందించారు.

By

Published : May 25, 2021, 4:20 PM IST

Sangareddy news
ప్రభుత్వాసుపత్రిలో అన్నదానం

లాక్​డౌన్​ వల్ల ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న కొవిడ్​ బాధితులు బంధువులు ఆహారం లేక ఇబ్బంది పడుతున్నారని జిల్లా సెషన్​ న్యాయవాది పాపిరెడ్డి అన్నారు. సంగారెడ్డి జిల్లా కేంద్రంలోని ప్రభుత్వాసుపత్రిలో అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. సుమారు 100 మందికి ఆహారం అందించారు.

లాక్​డౌన్ వల్ల తినడానికి బయట ఏమీ దొరకడం లేదని... అందువల్లనే అన్నదాన కార్యక్రమం నిర్వహించినట్లు తెలిపారు. లాక్​డౌన్​ ఉన్నన్ని రోజులు భోజనం అందిస్తామని వెల్లడించారు.

ఇదీ చూడండి:రాష్ట్రవ్యాప్తంగా పకడ్బందీగా అమలవుతోన్న లాక్‌డౌన్​

ABOUT THE AUTHOR

...view details