సంగారెడ్డి జిల్లాలో జహీరాబాద్ మున్సిపాలిటీలో తొలి కరోనా మరణం నమోదయింది. మున్సిపాలిటీ పరిధిలోని రంజోల్కు చెందిన 50 ఏళ్ల వ్యక్తి జూన్ 30న అనారోగ్య లక్షణాలతో హైదరాబాద్లోని ప్రైవేట్ ఆస్పత్రిలో చేరారు. పరీక్షల్లో కరోనా అని తేలడం వల్ల గాంధీ ఆస్పత్రిలో చేరారు. చికిత్స పొందుతూ శుక్రవారం రాత్రి మరణించారు. శనివారం నాడు మృతదేహాన్ని రంజోల్కు తీసుకువచ్చారు. వైద్య ఆరోగ్య శాఖ, రెవెన్యూ , పోలీసు అధికారుల పర్యవేక్షణలో కొవిడ్ నిబంధనలు పాటిస్తూ అంత్యక్రియలు పూర్తి చేశారు. కరోనా మరణంతో అప్రమత్తమైన మున్సిపల్ అధికారులు రంజోల్ గ్రామంలోని ప్రధాన వీధులు అంతర్గత దారుల్లో వైరస్ నివారణ రసాయనాలను పిచికారి చేశారు.
సంగారెడ్డి జిల్లాలో తొలి కరోనా మరణం - కరోనా తొలి మరణం
సంగారెడ్డి జిల్లా జహీరాబాద్లో తొలి కరోనా మరణం నమోదైంది. జహీరాబాద్ మున్సిపాలిటీ పరిధిలోని రంజోల్కు చెందిన 50 ఏళ్ల వ్యక్తి గాంధీ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందినట్లు.. వైద్యాధికారులు వెల్లడించారు.
సంగారెడ్డి జిల్లాలో తొలి కరోనా మరణం