తెలంగాణ

telangana

ETV Bharat / state

నాటుసారా కేంద్రాలపై పోలీసుల దాడి - Excise Police Attacks On Gudumba settlements

సంగారెడ్డి జిల్లా జహీరాబాద్​లో ఆబ్కారీ పోలీసులు నాటు సారా తయారీ కేంద్రాలపై దాడులు నిర్వహించారు. లాక్​డౌన్​ ఆంక్షలు అతిక్రమించి సారా తయారు చేస్తే పీడీ యాక్టు కింద కేసులు నమోదు చేస్తామని పోలీసులు హెచ్చరించారు.

Excise Police Attacks On Gudumba  settlements
నాటుసారా కేంద్రాలపై పోలీసుల దాడి

By

Published : Apr 30, 2020, 10:45 PM IST

సంగారెడ్డి జిల్లా జహీరాబాద్​లో ఆబ్కారీ పోలీసులు నాటు సారా కేంద్రాలపై దాడులు నిర్వహించారు. జహీరాబాద్​, మొగుడంపల్లి మండలాల్లోని తండాల్లో పోలీసులు మెరుపు దాడులు జరిపారు. దాడుల్లో 150 లీటర్ల నాటు సారా స్వాధీనం చేసుకున్నట్టు సీఐ అశోక్​ కుమార్​ తెలిపారు. విటు నాయక్​ తండా, సజ్జారావు పేట తండా, అర్జున్​ నాయక్​ తండా, ఉప్పర్​పల్లి తండాల్లో దాడులు నిర్వహించి ఐదుగురు సారా తయారీదార్లను అదుపులోకి తీసుకున్నట్టు సీఐ తెలిపారు. వారిపై కేసులు నమోదు చేసి జహీరాబాద్​ కోర్టులో హజరు పరుస్తామన్నారు. ఎవరైనా లాక్​డౌన్​ ఆంక్షలు అతిక్రమించి సారా తయారు చేస్తే.. కేసులు పెట్టి జైలుకు పంపుతామని హెచ్చరించారు.

ABOUT THE AUTHOR

...view details