భూములకు సంబంధించిన అన్ని ఆధారాలు తమ వద్ద ఉన్నాయని బాధితులు స్పష్టం చేశారు. బాధితులు ఆందోళన చేయడం వల్ల తహసీల్దార్ సరస్వతి అక్కడికి చేరుకొని వారికి సర్ది చెప్పే ప్రయత్నం చేశారు. ధర్మసాగర్ భూములకు సంబంధించిన కేసు కోర్టులో ఉందని ఆమె తెలిపారు. రెవెన్యూ అధికారులు చేసిన తప్పుకి సామాన్యులు అవస్థలు పడుతూ కోర్టుల చుట్టూ తిరుగుతున్నారు.
అప్పుడు అలా.. ఇప్పుడు ఇలా.. - mro saraswathi
అప్పుడు రెవెన్యూ అధికారులు చేసిన తప్పు.. ఇప్పుడు సామాన్యులకు శాపంగా మారింది. 1978లో రిజిస్ట్రేషన్ చేసిన భూములను 2017లో బిళ్లదకల భూములని స్వాధీనం చేసుకున్నారు. 242 ఎకరాల్లో వందకుపైగ కుటుంబాలు వ్యవసాయం చేసుకుంటూ జీవనం సాగిస్తున్న వారు కోర్టుల చుట్టూ తిరుగుతున్నారు.

అధికారుల తప్పుతో సామాన్యులకు తిప్పలు
అధికారుల తప్పుతో సామాన్యులకు తిప్పలు
ఇవీ చూడండి:పంచాయతీ రాజ్ చట్టంపై కేసీఆర్ దిశానిర్దేశం
Last Updated : Jul 13, 2019, 7:24 AM IST