సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ ఫారెస్ట్ రేంజ్ పరిధిలోని మొర్జి అటవీ ప్రాంతంలో ఊర కుక్కలు దాడి చేయడం వల్ల ఓ జింక మృతి చెందిందని నారాయణఖేడ్ అటవీ అధికారి దేవిలాల్ తెలిపారు. నాగలిగిద్ద శివారులో మంజీర నది ఎండిపోవడం వల్ల నీరు లేక జింకలు పలు గ్రామాల్లో ఉన్న బోర్ల వద్దకు వస్తున్నాయి.
కుక్కల దాడిలో ఓ జింక మృతి - sangareddy district
నారాయణఖేడ్ ఫారెస్ట్ రేంజ్లోని మెుర్జి అటవీ ప్రాంతంలో కుక్కల దాడిలో ఓ జింక మృతి చెందింది. మంజీర నది ఎండిపోవడం వల్ల జింకల్లో నీటి కోసం పలు గ్రామాలకు వస్తున్నాయని అటవీ అధికారులు తెలిపారు.
![కుక్కల దాడిలో ఓ జింక మృతి deer-killed-in-dogs-attack-in-sangareddy-district](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-6653320-32-6653320-1585954489269.jpg)
కుక్కల దాడిలో ఓ జింక మృతి
దీంతో కుక్కలు దాడి చేయగా గ్రామస్తులు రక్షించి అటవీ అధికారులకు సమాచారం ఇచ్చారు. కొన ఊపిరితో ఉన్న జింకను నారాయణఖేడ్ తరలిస్తుండగా మార్గం మధ్యలో చనిపోయిందని అటవీ అధికారి తెలిపారు.
కుక్కల దాడిలో ఓ జింక మృతి
ఇవీ చూడండి: 26 రకాల ఔషధాల ఎగుమతులపై ఆంక్షలు