తెలంగాణ

telangana

ETV Bharat / state

ద్విచక్ర వాహనంతో డీసీఎం ఢీ.. ఒకరు మృతి

ద్విచక్ర వాహనాన్ని డీసీఎం ఢీకొన్న ఘటనలో ఓ వ్యక్తి మృతి చెందగా మరోకరు తీవ్రంగా గాయపడ్డారు. సంగారెడ్డి జిల్లా జహీరాబాద్​లో ఈ ప్రమాదం చోటుచేసుకుంది.

By

Published : Jan 21, 2021, 9:54 AM IST

DCM collides with two-wheeler One killed in sangareddy
ద్విచక్ర వాహనంతో డీసీఎం ఢీ.. ఒకరు మృతి

సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ మండలం హుగ్గెల్లిలో రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ద్విచక్ర వాహనాన్ని డీసీఎం ఢీకొట్టగా.. ఓ వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందాడు. మరొకరికి తీవ్ర గాయాలయ్యాయి.

ఈ ఘటనలో హుగ్గెల్లికి చెందిన తాపీమేస్త్రీ శ్రీనివాస్(40) మృతి చెందగా.. వెనకాల కూర్చున్న మేరాజ్(32) తీవ్రంగా గాయపడ్డాడు. బాధితుడిని హైదరాబాద్​లోని గాంధీ ఆసుపత్రికి తరలించారు.

ఘటనా స్థలాన్ని సందర్శించిన జహీరాబాద్ ఎస్ఐ వెంకటేశ్​, డీసీఎంను స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసి, దర్యాప్తు ప్రారంభించినట్లు ఆయన తెలిపారు.

ఇదీ చదవండి:టర్పెంటైన్ ఆయిల్‌ పోసి నిప్పంటించిన ఘటనలో బాలుడు మృతి

ABOUT THE AUTHOR

...view details