తెలంగాణ

telangana

ETV Bharat / state

కొండెక్కిన చికెన్ ధరలు.. తగ్గించాలంటున్న చిరువ్యాపారులు

కరోనా ధాటికి మాంసం అమ్మకందారులు ప్రభావితమవుతున్నారు. చికెన్ ధరలు ఒక్కసారిగా పెరిగి రేట్లు ఆకాశాన్ని అంటాయి. మాంసం ప్రియులే కాకుండా అమ్మకందారులు సైతం పెరిగిన రేట్లను చూసి అవాక్కవుతున్నారు. సంగారెడ్డిలోని తమకు తీవ్ర నష్టం వాటిల్లిందని వ్యాపారులు వాపోయారు.

By

Published : May 26, 2020, 1:02 PM IST

చికెన్ ధర తగ్గుదలకు ప్రభుత్వం చొరవ తీసుకోవాలి : వ్యాపారులు
చికెన్ ధర తగ్గుదలకు ప్రభుత్వం చొరవ తీసుకోవాలి : వ్యాపారులు

సంగారెడ్డి జిల్లా కేంద్రంలో కరోనా ప్రభావానికి చికెన్ రేట్లు ఆకాశాన్నంటాయి. సామాన్యులు చికెన్, మాంసం తినడానికి ఆలోచిస్తున్నారు. వారానికి ఒక్కసారి తినడమే కష్టంగా మారింది. పైగా కరోనా క్లిష్ట కాలంలో ఉపాధి కూడా అంతంత మాత్రంగానే ఉంది. ఇళ్లలో మాంసం ప్రియులు ఉన్నందున.. రేట్లు పెరిగినా తప్పక తినాల్సి వస్తోందన్నారు.

రోజూవారీ గిరాకీతోనే...

కరోనా కారణంగా వివాహ వేడుకలు, హోటళ్లు, కర్రీ పాయింట్లు మూతపడటం వల్ల తమకు తీవ్ర నష్టం వాటిల్లుతోందని అమ్మకందారులు ఆందోళన వ్యక్తం చేశారు. చికెన్ రేట్లు పెరగటం వల్ల ఎవరూ కొనేందుకు ముందుకు రావట్లేదన్నారు. వేడుకల ఆర్డర్లు లేని సమయంలో రేట్లు పెరిగినందున రోజువారీ గిరాకీతోనే సంతృప్తి పడాల్సి వస్తోందన్నారు.

చికెన్ రేటు పెరిగింది... మటన్​కే ప్రాధాన్యత

లైవ్ బర్డ్ 150 రూపాయలు, చికెన్ 240, స్కిన్ లెస్ 260 రూపాయలకు అమ్ముతున్నామని వ్యాపారులు పేర్కొన్నారు. చికెన్ రేటు అధికంగానే ఉండటం వల్ల మేక మాంసానికే జనం ప్రాధాన్యత ఇస్తున్నారన్నారు. సామాన్య ప్రజలకు అందుబాటులో.. చికెన్ రేట్లను తగ్గిస్తే తమ గిరాకీ పెరిగే అవకాశాలున్నాయని అన్నారు. ప్రభుత్వం స్పందించి చికెన్ రేట్లు తగ్గే దిశగా చర్యలు తీసుకోవాలని కోరారు.

ఇవీ చూడండి : రాష్ట్రంలో మరో 66 కరోనా పాజిటివ్‌ కేసులు

ABOUT THE AUTHOR

...view details