తెలంగాణ

telangana

By

Published : Jun 15, 2020, 2:22 PM IST

ETV Bharat / state

అనుమానాస్పద స్థితిలో బ్యాంకు ఉద్యోగి మృతి

ఓ బ్యాంకు ఉద్యోగి అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన ఘటన సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్​లో జరిగింది. సోమవారం ఉదయం ఎంతకీ నిద్రలేవకపోగా.. కుటుంబసభ్యులు ఆసుపత్రికి తీసుకెళ్లగా.. అతను అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధరించారు.

bank-employee-died-in-suspicious-condition-at-narayankhed
అనుమానాస్పద స్థితిలో బ్యాంకు ఉద్యోగి మృతి

సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్​లో ఓ బ్యాంకు ఉద్యోగి అనుమానాస్పద స్థితిలో మృతి చెందారు. పట్టణంలోనే స్థానికంగా ఇల్లు అద్దెకు తీసుకుని కుటుంబసమేతంగా నివసిస్తున్నారు. సోమవారం ఉదయం ఎంతకీ నిద్రలేవకపోగా.. అతని భార్య ఇంటి యజమానికి సమాచారమిచ్చారు.

వారు అతన్ని 108 వాహనంలో ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అక్కడ పరీక్షించిన వైద్యులు.. అతను అప్పటికే మృతి చెందినట్లు నిర్ధరించారు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని కేసును దర్యాప్తు చేస్తున్నారు.

ఇదీ చదవండి:ఈటల​ ఓఎస్​డీకి కరోనా... గత 2రోజులుగా ఆయనతోనే మంత్రి

ABOUT THE AUTHOR

...view details