తెలంగాణ

telangana

ETV Bharat / state

సంగారెడ్డిలో చైనా అధ్యక్షుడి చిత్రపటం దగ్ధం - Bajarangdal China President Flex burn

గాల్వన్​లోయ ఘటనను నిరసిస్తూ చైనా అధ్యక్షుడు జిన్​పింగ్​ చిత్రపటాన్ని సంగారెడ్డి జిల్లా కేంద్రంలో భజరంగ్​దళ్​ కార్యకర్తలు దగ్ధం చేశారు. చైనా వస్తువులను ప్రజలు బహిష్కరించాలని వారు విజ్ఞప్తి చేశారు.

Breaking News

By

Published : Jun 20, 2020, 6:05 PM IST

సంగారెడ్డి జిల్లా కేంద్రంలో భజరంగ్ దళ్ కార్యకర్తలు చైనాకు వ్యతిరేకంగా ర్యాలీ నిర్వహించి... బస్టాండ్ చౌరస్తా వద్ద ఆ దేశాధ్యక్షుడు జిన్​పింగ్​ చిత్ర పటాన్ని దగ్ధం చేశారు. మన దేశ సంక్షేమం కోసం... చైనా వస్తువులను బహిష్కరించాలని ప్రజలు, వ్యాపారులకు భజరంగ్ దళ్ విజ్ఞప్తి చేసింది.

సంగారెడ్డి పట్టణంలోని మొబైల్ దుకాణాల్లోకి వెళ్లి.. ఇక నుంచి చైనా ఫోన్లు తీసుకురావద్దని కోరారు. వాటి అమ్మకాలు చేపట్టవద్దని వ్యాపారులకు సూచించారు. చైనా ఉత్పత్తులను మనదేశంలో బహిష్కరించడం వల్లనే ఆ దేశానికి బుద్ధి చెప్పినట్లవుతుందని వారు తెలిపారు.

ఇదీ చూడండి:యుద్ధ వ్యూహాలతో శత్రు దేశాలను ఎదుర్కొందాం : సీఎం కేసీఆర్‌

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details