తెలంగాణ

telangana

ఏటీఎం చోరీకి విఫలయత్నం.. రెడ్​హ్యాండెడ్​గా పట్టుబడిన వైనం

By

Published : Sep 5, 2020, 4:57 PM IST

సులువుగా సంపాదించాలనే దురుద్దేశంతో ఇద్దరు స్నేహితులు.. ఏటీఎంలలో దొంగతనాలు చేస్తూ పోలీసులకు రెడ్​ హ్యాండెడ్​గా దొరికిన సంఘటన సంగారెడ్డి జిల్లా పటాన్​చెరులో చోటుచేసుకుంది.

ATM thieves arrested in patancheru in sangareddy district
ఏటీఎం చోరీకి విఫలయత్నం..

సంగారెడ్డి పటాన్​ చెరు మండలం రుద్రారం గ్రామ పరిధిలోని యాక్సిస్​ బ్యాంక్ ఏటీఎంను ఇద్దరు వ్యక్తులు పగులగొట్టేందుకు ప్రయత్నిస్తుండగా.. పోలీసులకు రెడ్​ హ్యాండెడ్​గా దొరికారు. వారిని అదుపులోకి తీసుకుని విచారించగా.. వారు రామచంద్రాపురానికి చెందిన స్నేహితులు మహమూద్ ఖలీద్, ఎరుకల మహేశ్​గా గుర్తించారు.

ఇంతకుముందు వీరు ఐదు ఏటీఎంలలో చోరీకి విఫలయత్నం చేసినట్లు పోలీసులు తెలిపారు. జూన్ 8, జూన్ 19, ఆగస్టు 30 , సెప్టెంబర్ 1, సెప్టెంబర్​ 2న పలు చోట్ల ఏటీఎంలలో చోరీకి యత్నించారని వెల్లడించారు.

ABOUT THE AUTHOR

...view details