తెలంగాణ

telangana

ETV Bharat / state

జిన్నారంలో తెరాస, కాంగ్రెస్ వర్గీయుల​ మధ్య వాగ్వాదం

గడువు ముగిశాక కో ఆప్షన్​ సభ్యుల ఎంపిక కోసం నామినేషన్​ దాఖలు చేయడం వల్ల సంగారెడ్డి జిల్లా జిన్నారం మండలంలో కాంగ్రెస్​, తెరాస వర్గీయుల మధ్య  వాగ్వాదం చోటు చేసుకుంది.

By

Published : Jun 7, 2019, 12:07 PM IST

కో ఆప్షన్​ సభ్యుల ఎంపికలో తెరాస, కాంగ్రెస్​ మధ్య వాగ్వాదం

కో ఆప్షన్​ సభ్యుల ఎంపికలో తెరాస, కాంగ్రెస్​ మధ్య వాగ్వాదం

సంగారెడ్డి జిల్లా జిన్నారం మండలం కోఆప్షన్​ సభ్యుల ఎంపికలో వాగ్వాదం చోటు చేసుకుంది. తెరాస తరఫున శివానగర్​కు చెందిన ఇతిహాస్​ నామినేషన్​ దాఖలు చేశారు. కాంగ్రెస్​ తరఫున కాజిపల్లికి చెందిన మహ్మద్​ రావూఫ్​ గడువు ముగిశాక నామినేషన్​ దాఖలు చేయడం వల్ల తెరాస వర్గీయులు అభ్యంతరం తెలిపారు. ఈ క్రమంలో కాంగ్రెస్​, తెరాస వర్గీయుల మధ్య వాగ్వాదం జరిగింది. దీనిపై నిర్ణయాన్ని జిల్లా ఉన్నతాధికారులకు నివేదించామని ఎన్నికల అధికారులు తెలిపారు.

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details