తెలంగాణ

telangana

ETV Bharat / state

ముగిసిన అమీన్​పూర్​ నిందితుల కస్టడీ.. జైలుకు తరలింపు! - కంది జైలు

సంగారెడ్డి జిల్లా అమీన్​పూర్​ మారుతి అనాథాశ్రమంలో బాలిక అత్యాచారం కేసులో అదుపులోకి తీసుకున్న నిందితుల కస్టడీ గడువు ముగిసింది. వారిని జైలుకు తరలించేందుకు గానూ.. పోలీసులు పటాన్​చెరు ప్రభుత్వ ఆస్పత్రిలో వైద్య పరీక్షలు చేయించారు. అక్కడి నుంచి నేరుగా కంది జైలుకు తరలించారు.

Ameenpur Accused Sent To Kandi Jail
ముగిసిన అమీన్​పూర్​ నిందితుల కస్టడీ.. జైలుకు తరలింపు!

By

Published : Aug 18, 2020, 10:04 PM IST

సంగారెడ్డి జిల్లా అమీన్​పూర్​ అనాథాశ్రమంలో బాలికపై లైంగిక దాడి చేసిన ముగ్గురు నిందితులు పోలీసుల కస్టడీలో ఉన్న విషయం తెలిసిందే. రెండు రోజుల కస్టడీ గడువు ముగియడం వల్ల పోలీసులు వారిని జైలుకు తరలించేందుకు ఏర్పాట్లు చేశారు. అంతకంటే ముందు వారికి పటాన్​చెరు ప్రభుత్వ ఆస్పత్రిలో వైద్య పరీక్షలు చేయించారు. వారి ఆరోగ్య పరిస్థితి బాగానే ఉందని తేలడం వల్ల వారిని జిల్లాలోని కంది జైలులో అప్పజెప్పేందుకు తీసుకెళ్లారు.

ABOUT THE AUTHOR

...view details