ప్రతి కార్యక్రమంలో కానిస్టేబుళ్లు ఉన్నతమైన పాత్ర వహిస్తారని ఆమ్ఆద్మీ పార్టీ రాష్ట్ర కన్వీనర్ బూర రాము గౌడ్ అన్నారు. పోలీసు మాన్యువల్ ప్రకారం అర్హులైన కానిస్టేబుళ్లకు ప్రభుత్వం వెంటనే పదోన్నతులు కల్పించాలని డిమాండ్ చేశారు. పదోన్నతుల విషయంలో ప్రభుత్వ జాప్యాన్ని నిరసిస్తూ సంగారెడ్డి జిల్లా కలెక్టరేట్ ఎదుట మౌనదీక్ష చేపట్టారు.
కానిస్టేబుళ్ల పదోన్నతులపై నిర్లక్షం తగదు: ఆమ్ ఆద్మీ - సిద్ధిపేట జిల్లా తాజా వార్తలు
పోలీసు ఉన్నతాధికారులు కానిస్టేబుళ్లను చిన్న చూపు చూడటం మానుకోవలని ఆమ్ఆద్మీ పార్టీ రాష్ట్ర కన్వీనర్ బూర రాముగౌడ్ అన్నారు. పోలీస్ కానిస్టేబుళ్ల పదోన్నతుల విషయంలో ప్రభుత్వ జాప్యాన్ని నిరసిస్తూ సంగారెడ్డి కలెక్టరేట్ ఎదుట మౌనదీక్ష చేపట్టారు.
![కానిస్టేబుళ్ల పదోన్నతులపై నిర్లక్షం తగదు: ఆమ్ ఆద్మీ aam aadmi telangana convener demond to telangana government for constable promotions](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-10191072-860-10191072-1610285242402.jpg)
కానిస్టేబుళ్ల పదోన్నతులపై నిర్లక్షం తగదు: రాము గౌడ్
హైకోర్టు ఆదేశానుసారం పాత పోలీసు సంఘాన్ని రద్దు చేసి న్యాయ పరమైన హక్కులను పొందే స్వేచ్ఛ కొత్త పోలీసు సంఘానికి కల్పించాలని అన్నారు. తమ డిమాండ్లను నెరవేర్చకపోతే రాబోయే రోజుల్లో పెద్ద ఎత్తున ఉద్యమాలు చేపడతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఆమ్ఆద్మీ పార్టీ ఉమ్మడి మెదక్ జిల్లా అధ్యక్షుడు బోర్గీ సంజీవ్ పాల్గొన్నారు.
ఇదీ చదవండి:వైభవంగా గాయని సునీత వివాహం