తెలంగాణ

telangana

పర్యావరణ పరిరక్షణకై యువకుడి పాదయాత్ర

పర్యావరణ పరిరక్షణకై ఎమ్మెస్సీ విద్యార్థి జ్ఞానేశ్వర్ సంగారెడ్డి, మెదక్, సిద్దిపేట జిల్లాల్లో పాదయాత్ర చేపట్టాడు.

By

Published : Sep 30, 2019, 1:26 PM IST

Published : Sep 30, 2019, 1:26 PM IST

పర్యావరణ పరిరక్షణకై యువకుడి పాదయాత్ర

పర్యావరణ పరిరక్షణ... ప్లాస్టిక్ వినియోగంతో జరిగే నష్టాలపై ప్రజలకు అవగాహన కల్పించేందుకు ఓ యువకుడు సంగారెడ్డి జిల్లాలో పాదయాత్ర చేపట్టాడు. జిల్లాలోని ప్రతి గ్రామానికి వెళ్తూ ప్రజల్లో చైతన్యం నింపుతున్నాడు ఎమ్మెస్సీ విద్యార్థి జ్ఞానేశ్వర్. పదిరోజుల కిందట గ్రామం నుంచి బయలుదేరిన జ్ఞానేశ్వర్... మెదక్, సిద్దిపేట జిల్లా మీదుగా దాదాపు 60 గ్రామాలను చుట్టేశాడు. గాంధీ జయంతి రోజున సొంతూరు చేరుకుంటాడు.

పర్యావరణ పరిరక్షణకై యువకుడి పాదయాత్ర

ABOUT THE AUTHOR

...view details