సంగారెడ్డి జిల్లా మొగుడంపల్లి మండలం మన్నాపూర్ గ్రామానికి చెందిన దశరథ్ అనే యువకుడు సొంత నిధులు వెచ్చించి గ్రామంతో పాటు శివారు కాలనీల్లో రసాయన ద్రావణం పిచికారీ చేయించాడు. మహమ్మారితో తన స్నేహితుడితో పాటు మరో ఇద్దరు మరణించారని.. కొవిడ్ వల్ల మరెవ్వరూ చనిపోవద్దని ఈ నిర్ణయం తీసుకున్నట్లు దశరథ్ తెలిపాడు. గ్రామస్థుల ఆరోగ్యం కోసం ముందస్తు చర్యల్లో భాగంగా హైపోక్లోరైట్ ద్రావణం పిచికారీ చేయించడంపై పలువురు హర్షం వ్యక్తం చేశారు. దశరథ్ సేవాభావాన్ని అభినందించారు.
హైపోక్లోరైట్ ద్రావణం పిచికారీ చేయించిన యువకుడు - తెలంగాణ వార్తలు
ఊర్లో కరోనా కేసులు పెరుగుతుండడం.. మహమ్మారితో స్నేహితుడు సహా మరో ఇద్దరు వ్యక్తులు మరణించడం వల్ల కొవిడ్ బారిన పడి మరెవ్వరూ చనిపోవద్దనుకున్నాడు ఓ యువకుడు. సంగారెడ్డి జిల్లా మన్నాపూర్ గ్రామంలో హైపోక్లోరైట్ ద్రావణం పిచికారీ చేయించి పెద్ద మనసు చాటుకున్నాడు.
![హైపోక్లోరైట్ ద్రావణం పిచికారీ చేయించిన యువకుడు hypochlorite, Mannapur village, Sangareddy district](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-07:49:23:1621174763-tg-srd-26-16-spray-hypochlorite-av-ts10059-16052021185339-1605f-1621171419-52.jpg)
hypochlorite, Mannapur village, Sangareddy district