తెలంగాణ

telangana

ETV Bharat / state

అనుమానాస్పద స్థితిలో సగం కాలిన మృతదేహం - latest crime news in sangareddy district

రామచంద్రపురం మ్యాక్స్​ సొసైటీ రహదారి పక్కన సగం కాలిన ఓ యువకుడి మృతదేహం స్థానికంగా కలకలం సృష్టించింది. ఈ మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

A half-burnt body in suspicious condition
అనుమానాస్పద స్థితిలో సగం కాలిన మృతదేహం

By

Published : Jan 17, 2020, 10:11 PM IST

సంగారెడ్డి జిల్లా రామచంద్రపురం మ్యాక్స్​ సొసైటీ రహదారిని ఆనుకుని ఉన్న ప్రాంతంలో దారుణం చోటుచేసుకుంది. గుర్తు తెలియని దుండగులు ఓ యువకుడిని కాల్చేందుకు యత్నించడం వల్ల సగం కాలిన మృతదేహం బయటపడింది. ఫలితంగా చుట్టుపక్కల కాలనీవాసులు ఉలిక్కిపడ్డారు.

ఘటనా స్థలికి చేరుకున్న పోలీసులు మృతుడు బొంబాయి కాలనీకి చెందిన లతీఫ్​గా గుర్తించారు. ఆధారాలు సేకరించేందుకు వచ్చిన పోలీసు జాగిలం మ్యాక్స్ సొసైటీ పరిసర ప్రాంతాల్లో గల ఓ భవనం దాకా వెళ్లి ఆగిపోయింది. ఫలితంగా పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు.

అనుమానాస్పద స్థితిలో సగం కాలిన మృతదేహం

ఇవీ చూడండి : పురపోరులో తెరాసకు ఇంటిపోరు

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details