తెలంగాణ

telangana

ETV Bharat / state

సదాశివపేటలో 11 గంటల వరకు 43 శాతం పోలింగ్​ - Municipal Elections polling

సదాశివపేటలో మున్సిపల్​ ఎన్నికలు ప్రశాంతంగా జరుగుతున్నాయి. ఉదయం 11 గంటల వరకు 43 శాతం పోలింగ్​ నమోదైంది.

43 percent polling in Sadashivapet till 11 pm
సదాశివపేటలో 11 గంటల వరకు 43 శాతం పోలింగ్​

By

Published : Jan 22, 2020, 3:19 PM IST

సంగారెడ్డి జిల్లా సదాశివపేటలో మున్సిపల్​ ఎన్నికల పోలింగ్​ సజావుగా కొనసాగుతోంది. సదాశివపేట పురపాలక సంఘంలో 26 వార్డులకు గానూ... ఒక వార్డు ఏకగ్రీవం కాగా... మిగిలిన 25 వార్డులకు ఎన్నికలు జరుగుతున్నాయి. 25వ వార్డులో 100 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు.

ఎన్నికల కోసం పట్టణంలోని 52 పోలింగ్​ కేంద్రాలు ఏర్పాటు చేయగా... 336 మంది సిబ్బంది ఎన్నికల విధులు నిర్వహిస్తున్నారు. 11 గంటల వరకు 43 శాతం పోలింగ్​ నమోదైనట్లు ఎన్నికల అధికారులు ప్రకటించారు.

సదాశివపేటలో 11 గంటల వరకు 43 శాతం పోలింగ్​

ABOUT THE AUTHOR

...view details