తెలంగాణ

telangana

By

Published : Jul 18, 2020, 9:20 AM IST

ETV Bharat / state

ఉమ్మడి మెతుకుసీమపై కరోనా పంజా.. ఒక్కరోజే 100 కేసులు

ఉమ్మడి మెతుకుసీమపై కరోనా తన ప్రతాపం చూపిస్తోంది. మహమ్మారి బారినపడుతున్న వారి సంఖ్య రోజురోజుకూ ఎక్కువవుతోంది. ఎన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నా వైరస్​ విజృంభణ కొనసాగుతుండటం వల్ల స్థానికులు ఆందోళన చెందుతున్నారు.

100 new corona cases in joint medak district
ఉమ్మడి మెతుకుసీమపై కరోనా పంజా.. ఒక్కరోజే 100 కేసులు

ఉమ్మడి మెదక్ జిల్లాలో కరోనా ఉద్ధృతి కొనసాగుతోంది. శుక్రవారం మరో 100 మంది ఈ వైరస్​ బారినపడగా.. ఇద్దరు మృతి చెందినట్లు వైద్యాధికారులు వెల్లడించారు. ఇందులో సంగారెడ్డి జిల్లాలో అత్యధికంగా 72 కేసులు వెలుగుచూడగా.. ఇద్దరు చనిపోయారు. సిద్దిపేట జిల్లాలో 19 మంది వైరస్​ బారినపడగా.. మెదక్​ జిల్లాలో 9 మంది కరోనా కోరల్లో చిక్కుకున్నారు.

ఫలితంగా అప్రమత్తమైన అధికారులు కేసులు నమోదైన ప్రాంతాలను రసాయన ద్రావణాలతో పిచికారీ చేయిస్తున్నారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని.. అత్యవసరమయితే తప్ప బయటకు రావొద్దని సూచిస్తున్నారు.

మరోవైపు కొవిడ్​ వ్యాప్తి రోజురోజుకూ పెరుగుతుండటం వల్ల ఒక్కో పట్టణం స్వచ్ఛందంగా లాక్​డౌన్ పాటిస్తున్నాయి. ఇప్పటికే జహీరాబాద్, సదాశివపేటలో అధికారులు లాక్​డౌన్​ అమలు చేస్తుండగా.. నేటి నుంచి దుబ్బాకలోనూ అమలు చేయనున్నారు.

ఇదీచూడండి: ఉమ్మడి ఖమ్మం జిల్లాలో 20 మందికి కరోనా పాజిటివ్​

ABOUT THE AUTHOR

...view details