తెలంగాణ

telangana

'నియామక పత్రాలు అందుకున్న టీఆర్టీ అభ్యర్థులు'

చాలా కాలంగా పెండింగ్​లో ఉన్న టీఆర్టీ నియామకాలకు సంబంధించిన...నియామక పత్రాలు అందుకోవడం పట్ల అభ్యర్థులు సంతోషం వ్యక్తం చేశారు. అనంతరం పాఠశాలల అభివృద్ధికి కృషి చేస్తామని వివరించారు

By

Published : Jul 13, 2019, 8:57 PM IST

Published : Jul 13, 2019, 8:57 PM IST

విద్యార్థుల బంగారు భవిష్యత్తుకు బాటలు వేస్తాం : టీఆర్టీ

రంగారెడ్డి జిల్లా జడ్పీ కార్యాలయంలో టీఆర్టీ అభ్యర్థులు నియామక పత్రాలు అందుకున్నారు. ధ్రువ పత్రాల జారీకి ఆలస్యమైనప్పటికీ నేడు నియామక పత్రాలు అందుకోవడం పట్ల టీఆర్టీ ఉపాధ్యాయ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు మల్లికార్జున్​ గౌడ్ ఆనందం వ్యక్తం చేశారు. తమ వెంట ఉంటూ వెన్నుతట్టి ముందుకు నడిపించిన ఉపాధ్యాయ సంఘాలు, ప్రజా సంఘాలకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.
పెండింగ్​లో ఉన్న ఎస్జీటీ, పీహెచ్​సీ, ఎస్ఏ హిందీ, ఎల్​పీ హిందీ, పీఈటీ నియామకాలు వెంటనే చేపట్టాలని డిమాండ్ చేశారు. టీఆర్టీ నియామకాలు చేపట్టినందుకు సీఎం కేసీఆర్​కు ధన్యవాదాలు తెలిపారు. పాఠశాలల అభివృద్ధిలో కీలక పాత్ర పోషించి, విద్యార్థుల బంగారు భవిష్యత్తుకు బాటలు వేస్తామని స్పష్టం చేశారు.

నియామక పత్రాలు అందుకోవడం ఆనందదాయకం : టీఆర్టీ అభ్యర్థులు

ABOUT THE AUTHOR

...view details