తెలంగాణ

telangana

By

Published : Nov 29, 2020, 4:43 PM IST

ETV Bharat / state

రాజేంద్రనగర్‌ 5 డివిజన్లలో తెరాస బైక్‌ ర్యాలీ

బల్దియా ఎన్నికల ప్రచారం చివరిరోజు కావడంతో అభ్యర్థులు ప్రచారాల్లో వేగం పెంచారు. రాజేంద్రనగర్‌లోని 5 డివిజన్లలో ఎమ్మెల్యే ప్రకాశ్‌ గౌడ్‌ ఆధ్వర్యంలో తెరాస కార్యకర్తలు బైక్‌ ర్యాలీ నిర్వహించారు.

trs bike rally rajendra nagar 5 divisions
రాజేంద్ర నగర్‌ 5 డివిజన్లలో తెరాస బైక్‌ ర్యాలీ

గ్రేటర్‌ ఎన్నికల్లో భాగంగా చివరి రోజు.. తెరాస అభ్యర్థులు ప్రచారంలో వేగం పెంచారు. రాజేంద్రనగర్‌ 5 డివిజన్లలో ఎమ్మెల్యే ప్రకాశ్‌ గౌడ్‌ ఆధ్వర్యంలో కార్పొరేటర్లకు మద్దతుగా కార్యకర్తలు బైక్ ర్యాలీ నిర్వహించారు. అత్తాపూర్‌ డివిజన్‌లో అభ్యర్థి మాధవి తరఫున ప్రచారం చేపట్టారు. ప్రజల ఆదరణ చూస్తుంటే భారీ మెజార్టీతో గెలుస్తానని అభ్యర్థి మాధవి ధీమా వ్యక్తం చేశారు.

ABOUT THE AUTHOR

...view details