తెలంగాణ

telangana

By

Published : Dec 17, 2019, 4:36 PM IST

ETV Bharat / state

'ఫ్లాట్​​ కోసం దాచుకుంటే దొంగలెత్తుకెళ్లారు'

ప్లాట్​ కోసం దాచుకున్న సొమ్మును దొంగలు ఎత్తుకెళ్లారు. రంగారెడ్డి జిల్లా తుర్కయంజాల్​ మున్సిపాలిటీ పరిధిలోని కమ్మగూడలో దుండగులు 2 లక్షల 40 వేల నగదు, 1.5 తులాల బంగారం, 25 తులాల వెండిని అపహరించారు.

'ఫ్లాట్​​ కోసం దాచుకుంటే దొంగలెత్తుకెళ్లారు'
'ఫ్లాట్​​ కోసం దాచుకుంటే దొంగలెత్తుకెళ్లారు'

'ఫ్లాట్​​ కోసం దాచుకుంటే దొంగలెత్తుకెళ్లారు'
ఇంటి తాళం పగులగొట్టి చోరీకి పాల్పడిన ఘటన రంగారెడ్డి జిల్లా తుర్కయంజాల్ మున్సిపాలిటీ పరిధిలోని కమ్మగూడలో చోటు చేసుకుంది. భాగ్యలక్ష్మి కుటుంబం ఈనెల 11న చంపాపేట్​లోని కుమార్తె ఇంటికి వెళ్లింది. తిరిగి సోమవారం సాయంత్రం వచ్చి చూసేసరికి ఇంటి తాళం పగులగొట్టి ఉంది.

లోపలికి వెళ్లి చూడగా బీరువా తెరిచి ఉంది. అందులో ఉన్న రెండు లక్షల 40 వేల నగదు, 1.5 తులం బంగారం, 25 తులాల వెండిని దుండగులు అపహరించారు. బాధితుల ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకున్న వనస్థలిపురం పోలీసులు క్లూస్ టీం సహాయంతో దర్యాప్తు చేస్తున్నారు. ఫ్లాట్​ కొందామని దాచుకున్న సొమ్మును దొంగలు ఎత్తుకెళ్లారని బాధితురాలు వాపోయింది.

ABOUT THE AUTHOR

...view details