తెలంగాణ

telangana

గౌరెల్లిలో ముగిసిన సురేష్ అంత్యక్రియలు

ఉస్మానియా ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందిన తహసీల్దార్ విజయారెడ్డి హత్యకేసు నిందితుడు సురేష్‌ అంత్యక్రియలు రంగారెడ్డి జిల్లా గౌరెల్లిలో ముగిశాయి.

By

Published : Nov 8, 2019, 5:23 AM IST

Published : Nov 8, 2019, 5:23 AM IST

Updated : Nov 8, 2019, 8:05 AM IST

గౌరెల్లిలో ముగిసిన సురేష్ అంత్యక్రియలు

రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్​మెట్​లో తహసీల్దార్ విజయారెడ్డి హత్యకేసు నిందితుడు సురేష్.. ఉస్మానియా ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరణించాడు. శ్వాస తీసుకోవడంలో ఇబ్బందిగా ఉండగా వైద్యులు వెంటిలెటర్‌పై చికిత్స అందించారు. నిన్న మధ్యాహ్నం పరిస్థితి విషమించి సురేష్‌ మృతి చెందినట్లు వైద్యులు ప్రకటించారు. ఆయన అంత్యక్రియలు అబ్దుల్లాపూర్​మెట్ మండలం గౌరెల్లిలో భారీ బందోబస్తు నడుమ ముగిశాయి. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు అన్ని జాగ్రత్తలు తీసుకున్నారు.

Last Updated : Nov 8, 2019, 8:05 AM IST

ABOUT THE AUTHOR

...view details