రంగారెడ్డి జిల్లా గుర్రంగూడలో ఆరోగ్య సంజీవని వనం అర్బన్ ఫారెస్ట్ పార్క్ను ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్కే జోషి ప్రారంభించారు. అనంతరం సైకిల్పై పార్క్ను చుట్టేశారు. ఈ కార్యక్రమానికి అటవీశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అజయ్ మిశ్రా, పీసీసీఎఫ్ పీకే ఝా, జిల్లా ఉన్నతాధికారులు, సిబ్బంది హాజరయ్యారు. మొత్తం 129 పార్కులు ఉన్నాయని వాటిలో 59 పార్కులను అర్బన్ పార్కులుగా అభివృద్ధి చేస్తామని అజయ్ మిశ్రా తెలిపారు. త్వరలో మరిన్ని ఉద్యానవనాలు ప్రారంభమవుతాయని వెల్లడించారు.
ఆరోగ్య సంజీవని అర్బన్ పార్కును ప్రారంభించిన ఎస్కే జోషి - అటవీశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి
రంగారెడ్డి జిల్లా గుర్రంగూడలో 'ఆరోగ్య సంజీవని వనం' పట్టణ ఉద్యానవనాన్ని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్కే జోషి ప్రారంభించారు. ఇలాంటి పార్కులు మరిన్ని నిర్మిస్తామని తెలిపారు.
'అర్బన్ పార్కును ప్రారంభించిన ఎస్కే జోషి'