దుకాణంలో విద్యుదాఘాతం... ఆస్తినష్టం - RANGAREDDY DISTRICT GROCERY STORE SHORT CIRCUIT
రంగారెడ్డి జిల్లా శంకర్ పల్లి మండలం ప్రొద్దుటూరులోని ఓ కిరాణా షాపులో అగ్నిప్రమాదం సంభవించింది. దుకాణం పూర్తిగా దగ్ధమైనప్పటికీ ఇంట్లో ఎవ్వరూ లేకపోవడం వల్ల ప్రాణ నష్టం తప్పింది.

రంగారెడ్డి జిల్లా శంకర్పల్లి మండలం ప్రొద్దుటూర్ గ్రామంలోని ఏనుగు చెన్నారెడ్డి ఇంట్లోని కిరాణా షాపులో అగ్ని ప్రమాదం జరిగింది. షార్ట్ సర్క్యూట్ వల్లే ఈ ప్రమాదం జరిగిందని అధికారులు ప్రాథమికంగా అంచనా వేశారు. అందరూ చేవెళ్లలో పెళ్లికి వెళ్లారు. ఇంట్లో ఎవరూ లేకపోవడంతో ప్రాణ నష్టం తప్పింది. నివాసంలోని వస్తువులు పూర్తిగా కాలిపోయాయి. సుమారు 8 లక్షల రూపాయల మేర ఆస్తి నష్టం వాటిల్లిందని అంచనా వేస్తున్నారు.శంకర్పల్లి పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. బాధిత కుటుంబాన్ని అన్ని విధాలా ఆదుకుంటామని చేవెళ్ల ఎమ్మెల్యే కాలే యాదయ్య తెలిపారు.